ప్రాక్టీస్ పరీక్షలే కీలకం
పేరు: భారతి
మాది కర్నూలు. నాన్న పద్మాజిరావు, అమ్మ హేమ. ఇంటర్ పూర్తయ్యాక....2015-17 విద్యాసంవత్సరంలో డీఎడ్ కోర్సు పూర్తి చేశాను. ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతం దూరవిద్యలో తృతీయ సంవత్సరం చదువుతున్నా. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో పేపర్-1 పరీక్షలో పాల్గొని 150 మార్కులకు 141 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచా!