బట్టీ వ్యర్థం.. వేగం ముఖ్యం: రవిశ్రీతేజ
ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే అభినందిస్తాం. రెండు రాష్ట్రాల ఎంసెట్లలోనూ టాప్ ర్యాంకు వస్తే ఇంకా మెచ్చుకుంటాం. మరి రెండింటిలోనూ ప్రథమ ర్యాంకు తెచ్చుకుంటే? ఆ పనే చేసి ఆశ్చర్యపరిచాడు తాడేపల్లిగూడెం విద్యార్థి కురిశేటి రవిశ్రీతేజ. బట్టీ పట్టే విధానం ఎంసెట్లాంటి ఏ పోటీ పరీక్షకూ సరిపోదంటున్న ఇతడు తనకీ ఘనత ఎలా సాధ్యమైందో, అందుకు తను చేసిన కృషి ఏమిటో వివరిస్తున్నాడు..!