చదవడంలో ప్రణాళిక తప్పనిసరి
* పీజీమెట్ - 2014 ప్రథమ ర్యాంకర్ శ్రీరాంరెడ్డి
గాంధీ ఆసుపత్రి, న్యూస్టుడే: 'ప్రణాళిక ప్రకారం చదివితే విజయం తప్పక వరిస్తుందని పేర్కొంటున్నారు 2014 పీజీ మెట్ ప్రథమ ర్యాంకర్ శ్రీరాం రెడ్డి. ఎన్టీఆర్ వర్సిటీ ఇటీవల ప్రకటించిన పీజీమెట్- 2014లో గాంధీమెడికల్ కళాశాలకు చెందిన వైద్యవిద్యార్థి శ్రీరాంరెడ్డి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. ప్రణాళిక ప్రకారం చదవడంవల్లే తనకీ ర్యాంకు వచ్చినట్లు తెలిపారు. ప్రథమ ర్యాంకు సాధించిన సందర్భంగా శ్రీరాంరెడ్డితో 'న్యూస్టుడే ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.....