Asked By: మురళీ కిరణ్
Ans:
ఎమ్మెస్సీలో కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ల్లో ఏ కోర్సు చదివినా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. ఈ రెండు కోర్సులూ విభిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారు అనే విషయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిశోధన, బోధన రంగాల్లో ఆసక్తి, విదేశాల్లో స్థిరపడాలన్న అభిలాష లాంటివీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఏ యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో, ఆ వర్సిటీల సిలబస్ను గమనించి ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోండి.
కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ అప్లైడ్ సైన్స్ కోర్సు అయితే మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ అనేది కొంతవరకు బేసిక్ సైన్స్ అని చెప్పవచ్చు. రెండు కోర్సుల్లోనూ పరిశోధనకు విస్తృత అవకాశాలున్నాయి. రెండు కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎస్. రవిశంకర్
Ans:
వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. మెయింటెనెన్స్ ఇంజినీర్, సూపర్ వైజర్, స్టాక్ కీపర్, స్టోర్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెంటరీ సూపర్ వైజర్, వేర్హౌస్ మేనేజర్..ఇలా భిన్న విధుల్లో చేరవచ్చు. ఎంఎస్ ఆఫీస్లో ప్రావీణ్యంతో పాటు క్యాడ్లో కొంత పరిజ్ఞానాన్ని కూడా సంపాదిస్తే మీ అవకాశాలు మెరుగవుతాయి. మీరు ఫార్మా, బేవరెజెస్, హాస్పిటల్స్, ఈ- కామర్స్, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్, ఇంజినీరింగ్ లాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం. చంద్రశేఖర్
Ans:
డిగ్రీ మొదటి సంవత్సరంలోనే విదేశాల్లో పీజీ చదవడం గురించి ఆలోచించటం అభినందనీయం. సాధారణంగా విదేశాల్లో పీజీ చేయాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అవసరం. చాలా విదేశీ యూనివర్సిటీలు ఆంగ్లభాషా నైపుణ్యం పరీక్షించడానికి టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును ప్రామాణికంగా తీసుకొంటాయిు. కొన్ని యూనివర్సిటీలు ఆంగ్లభాషలో ప్రావీణ్యంతో పాటు జీఆర్ఈ/ జీమ్యాట్ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును కూడా పరిగణించి ప్రవేశాలు కల్పిస్తాయి. మీరు చదవాలనుకునే దేశం, కోర్సు, యూనివర్సిటీలను బట్టి రాయాల్సిన పరీక్షలను ఎంచుకోండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: మురళీ కిరణ్
Ans:
ఎమ్మెస్సీలో కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ల్లో ఏ కోర్సు చదివినా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. ఈ రెండు కోర్సులూ విభిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారు అనే విషయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిశోధన, బోధన రంగాల్లో ఆసక్తి, విదేశాల్లో స్థిరపడాలన్న అభిలాష లాంటివీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఏ యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో, ఆ వర్సిటీల సిలబస్ను గమనించి ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోండి.
కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ అప్లైడ్ సైన్స్ కోర్సు అయితే మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ అనేది కొంతవరకు బేసిక్ సైన్స్ అని చెప్పవచ్చు. రెండు కోర్సుల్లోనూ పరిశోధనకు విస్తృత అవకాశాలున్నాయి. రెండు కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: - ఎం. చంద్రశేఖర్
Ans:
డిగ్రీ మొదటి సంవత్సరంలోనే విదేశాల్లో పీజీ చదవడం గురించి ఆలోచించటం అభినందనీయం. సాధారణంగా విదేశాల్లో పీజీ చేయాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అవసరం. చాలా విదేశీ యూనివర్సిటీలు ఆంగ్లభాషా నైపుణ్యం పరీక్షించడానికి టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును ప్రామాణికంగా తీసుకొంటాయిు. కొన్ని యూనివర్సిటీలు ఆంగ్లభాషలో ప్రావీణ్యంతో పాటు జీఆర్ఈ/ జీమ్యాట్ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును కూడా పరిగణించి ప్రవేశాలు కల్పిస్తాయి. మీరు చదవాలనుకునే దేశం, కోర్సు, యూనివర్సిటీలను బట్టి రాయాల్సిన పరీక్షలను ఎంచుకోండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: - ఎం.సునీత
Ans:
మీటీయొరాలజీ కోర్సులో వాతావరణ పరిశీలనల రికార్డింగ్, వాతావరణ డేటాను విశ్లేషించడం, వాతావరణ వ్యవస్థల అంచనాకు కావాల్సిన సాంకేతికత పరికరాలపై శిక్షణ అందిస్తారు. వీటితో పాటుగా ఉష్ణమండల తుపానులు, పట్టణ వరదలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు, కరువు, భూకంపాలు, వేడి తరంగాలు, చల్లని తరంగాలు, రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్), వాతావరణ రాడార్లు, వాతావరణ ఉపగ్రహాల ప్రత్యేకత, రోజువారీ వాతావరణ మార్పులు, భూతాప ప్రభావాల గురించీ నేర్చు కొంటారు. మీరు డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్ చదివారు కాబట్టి మీటీయొరాలజీ కోర్సులో పీజీ/ డిప్లొమా చదవడానికి అర్హులే.
వాతావరణ శాస్త్రం లాంటి ప్రొఫెషనల్ కోర్సులను దూరవిద్యలో కాకుండా రెగ్యులర్గా చదవడమే మంచిది. డిప్లొమా కంటే పీజీ చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. మీటీయొరాలజీలో పీజీ కోర్సు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ, బెర్హాంపుర్ లాంటిచోట్ల అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎమ్మెస్సీ చదివారు కాబట్టి గేట్ రాసి ఎంటెక్ కోర్సు చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీటీయొరాలజీలో ఎంటెక్ కోర్సు ఐఐఎస్సీ బెంగళూర్, ఐఐటీ దిల్లీ, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ భువనేశ్వర్, సావిత్రిబాయి ఫూలే పుణె వర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో అందుబాటులో ఉంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కె. విజయ్కుమార్
Ans:
సాధారణంగా ఏ బ్రాంచితో ఇంజనీరింగ్ చేసినవారికైనా కనీసం నాలుగు అవకాశాలు ఉంటాయి. మొదటిది- వారికి సంబంధించిన బ్రాంచిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కోర్ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం. రెండోది- ఐటీ/ సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళడం. మూడోది- సొంతంగా ఒక సంస్థ స్థాపించడం. నాలుగోది- ఉన్నత విద్యను అభ్యసించడం. వీటితో పాటు డిగ్రీ అర్హతతో పోటీ పరీక్షలు రాయడమూ మరొక మార్గం. ఇక మీ అబ్బాయి విషయానికొస్తే పైన చెప్పిన ఐదు అవకాశాల్లో తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోమని చెప్పండి. ఇటీవలి కాలంలో చాలా ప్రభుత్వరంగ సంస్థలు గేట్ ద్వారా నియామకాలు చేస్తున్నాయి. మీ అబ్బాయిని గేట్ రాయమని చెప్పండి. గేట్ ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్ చేసే అవకాశం ఉంది. క్యాట్ రాసి ఐఐఎంల్లాంటి విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయవచ్చు. క్యాట్లో మంచి స్కోర్ రాకపోతే, వివిధ ప్రైవేటు మేనేజ్మెంట్ విద్యాసంస్థలు నిర్వహించే ప్రత్యేకమైన ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా సంస్థల్లో కూడా ఎంబీఎ చేయవచ్చు. జీఆర్ఈ, టోఫెల్ల ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: నిఖిత
Ans:
మీ లక్ష్యం అభినందనీయం. టీఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో ముఖ్యమైనవి గ్రూప్-1, 2. ఈ పరీక్షలకు సంబంధించిన స్కీమ్, సిలబస్ లాంటివి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లోనుంచి డౌన్లోడ్ చేసుకోండి. గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాల కోసం అంతర్జాలంలో శోధించండి. వీలుంటే, హైదరాబాద్లో ఉండి గ్రూప్-1, 2 పరీక్షలకు సన్నద్ధమయ్యే మీ మిత్రబృందంతో ఆన్లైన్ స్టడీ గ్రూప్ ఏర్పాటు చేసుకొని, పరీక్షలకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించండి. సిలబస్కు అనుగుణంగా ఆన్లైన్/ ఆఫ్లైన్ మెటీరియల్ చదువుతూ సొంతంగా నోట్స్ తయారు చేసుకోండి. కరోనా మూలంగా చాలా కోచింగ్ సంస్థలు ఆన్లైన్ శిక్షణను అందిస్తున్నాయి. వాటిలో మేలైనదాన్ని విచారించి ప్రవేశం పొందండి. తెలంగాణకు సంబంధించిన సిలబస్ మినహా, మిగతా సిలబస్ చాలావరకూ యూపీఎస్సీ సిలబస్కి దగ్గరగా ఉంటుంది. యూపీఎస్సీ పరీక్షల ఆన్లైన్ మెటీరియల్నూ చదవండి. ఆన్లైన్లో ఈనాడు విద్యాసమాచారాన్నీ, ప్రతిభ మెటీరియల్నూ అనుసరించండి. ముఖ్యంగా సంపాదకీయాలనూ, వ్యాసాలనూ చదివి అర్ధం చేసుకొని నోట్స్ రాసుకోండి. గ్రూప్-1, గ్రూప్-2 శిక్షణలో నిష్ణాతులైనవారిని ఆన్లైన్లో సంప్రదించి, వారి సూచనలను తీసుకొంటూ మీ ఆశయాన్ని నెరవేర్చుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి. సాయిశ్రీ
Ans:
మీరు నిరభ్యంతరంగా విదేశీ యూనివర్సిటీల్లో ఎంఏ చదవవచ్చు. కొన్ని విదేశీ వర్సిటీలు మాత్రం నాలుగు సంవత్సరాల డిగ్రీ చదివిన వారికే ఎంఏలో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు ఆంగ్ల భాషకు సంబంధించిన పరీక్ష స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించడం కోసం టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ లాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వివిధ దేశాల్లోని వివిధ యూనివర్సిటీలు ఒక్కో రకమైన పరీక్షలో వచ్చిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్ని యూనివర్సిటీలు ఈ మూడు పరీక్షల్లో ఏ పరీక్ష ద్వారానైనా ప్రవేశాలు కల్పిస్తాయి. అతి తక్కువ యూనివర్సిటీలు మాత్రమే ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మీరు ఎంఏ తరువాత పీ‡హెచ్డీ చేయాలనుకొంటే ఇంటిగ్రేటెడ్ ఎంఏ పీహెచ్డీ ప్రోగ్రామ్ ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చేయాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అతి కొద్ది యూనివర్సిటీలు మాత్రమే అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులకు స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రాజేష్
Ans:
ఒక రెగ్యులర్ డిగ్రీతో పాటు మరో డిగ్రీని ఓపెన్/ డిస్టెన్స్/ఆన్లైన్లో చేయవచ్చన్న ప్రతిపాదనను యూజీసీ మే 2020లో ఆమోదించినట్లుగా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. యూజీసీ నోటిఫికేషన్ అన్ని వివరాలతో వస్తుందని అందరూ ఆశించారు. కానీ సంబంధిత పూర్తి నోటిఫికేషన్ యూజీసీ వెబ్సైట్లో ఇంకా అందుబాటులో లేదు. రెండు డిగ్రీల్లో ఒకటి మామూలు డిగ్రీ, మరొకటి ప్రొఫెషనల్ కోర్సు అయితే ఈ అవకాశం వర్తిస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. మీరు విడివిడిగా రెండు డిగ్రీలను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయం 2020లో తీసుకున్నారు కాబట్టి, 2020కి ముందు చదివినవారికి వెసులుబాటు ఉంటుందా, ఉండదా అనేది యూజీసీ పూర్తి నోటిఫికేషన్ వచ్చాకే తెలుస్తుంది. - ప్రొ.బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్