అమరావతి: ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు జూన్ 22న విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ‘‘ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో 2,58,449 మంది ఉత్తీర్ణత కాగా.. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్ అయ్యారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 72 శాతం ఉత్తీర్ణత నమోదవగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 50శాతం మంది పాసయ్యారు’’ అని మంత్రి తెలిపారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం ... మీ కోసం!
‣ నీట్
ఇంటర్ తర్వాత
‣ వైద్య వృత్తి... ఎప్పటికీ డిమాండే!
‣ ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ
‣ ఇంటర్ చాలు.. వేల ఉద్యోగాలు!
‣ విదేశీ భాషలు.. విశేష అవకాశాలు!
‣ మార్కెట్ నిర్దేశకులు... కామర్స్ నిపుణులు
‣ ఆకాశమే హద్దుగా.. యానిమేషన్ రంగం
టెన్త్ తర్వాత
‣ ఐటీఐ
‣ ఆర్జేసీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.