• facebook
  • whatsapp
  • telegram

AP: విద్యాహక్కు చట్టం నిబంధనకు సవరణ

ఈనాడు, అమరావతి: విద్యాహక్కు చట్టం నిబంధనకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిబంధన-10లోని సబ్‌ రూల్‌ ఆరు ప్రకారం విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తరఫున ప్రభుత్వం రెండు విడతల్లో ఫీజులను ఆర్టీజీఎస్‌ లేదా నెఫ్ట్‌ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకు చెల్లించాలి. సెప్టెంబరులో మొదటి విడత 50 శాతం, మిగతా మొత్తాన్ని జనవరిలో ప్రతి ఏటా చెల్లించాలి. దీన్ని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఈ నిబంధనకు సవరణ చేసింది. అమ్మఒడి కింద తీసుకునే డబ్బుల నుంచి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలో నిధులు పడిన 60 రోజుల తర్వాత కూడా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లించి, ఆ తర్వాత సంవత్సరం అమ్మఒడి నుంచి మినహాయించుకుంటుందని స్పష్టం చేసింది. అమ్మఒడి డబ్బుల నుంచి ఫీజులు చెల్లించుకుంటే ఇక విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు ఎందుకని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.