ఈనాడు, అమరావతి: విద్యాహక్కు చట్టం నిబంధనకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధన-10లోని సబ్ రూల్ ఆరు ప్రకారం విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తరఫున ప్రభుత్వం రెండు విడతల్లో ఫీజులను ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకు చెల్లించాలి. సెప్టెంబరులో మొదటి విడత 50 శాతం, మిగతా మొత్తాన్ని జనవరిలో ప్రతి ఏటా చెల్లించాలి. దీన్ని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఈ నిబంధనకు సవరణ చేసింది. అమ్మఒడి కింద తీసుకునే డబ్బుల నుంచి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలో నిధులు పడిన 60 రోజుల తర్వాత కూడా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లించి, ఆ తర్వాత సంవత్సరం అమ్మఒడి నుంచి మినహాయించుకుంటుందని స్పష్టం చేసింది. అమ్మఒడి డబ్బుల నుంచి ఫీజులు చెల్లించుకుంటే ఇక విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు ఎందుకని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.