తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: జూన్ రెండో తేదీ లోపు జరిగే ప్రవేశ పరీక్షలు రాసే ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు వచ్చే జూన్ రెండో తేదీతో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత తెలంగాణ వారికే స్థానికత వర్తిస్తుందని, ఏపీ విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసినా వారికి ఇక్కడి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉండవని వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.