ఈనాడు, హైదరాబాద్: పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం(మే 31) నోటిఫికేషన్ జారీ అయింది. పదో తరగతి అర్హతతో పాలిసెట్-2023 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబ్నగర్, హనుమకొండ జిల్లా మామునూరు, సిద్దిపేట, కరీంనగర్లోని పశువైద్య పాలిటెక్నిక్ కళాశాలల్లో 121 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా భావదేవరపల్లిలోని మత్స్యశాస్త్ర(ఫిషరీస్) పాలిటెక్నిక్ కళాశాలలోని 11 సీట్లకూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 19వ తేదీలోగా పశువైద్య విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.tsvu.edu.in లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.