• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET: 14న ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల వెల్లడి

* ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజీ

జేఎన్టీయూ(అనంతపురం): ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2023) ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్‌ 14న(బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని సెట్‌ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య జి.రంగ జానార్ధన, కన్వీనర్ ఆచార్య సి.శోభా బిందు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మే 15 నుంచి 19వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈఏపీసెట్‌ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేసిన అధికారులు..  మే 24 నుంచి 26వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతపురం జేఎన్‌టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్‌ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్‌ ర్యాంకులను ప్రకటించనున్నారు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.