* ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ
జేఎన్టీయూ(అనంతపురం): ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2023) ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న(బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని సెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య జి.రంగ జానార్ధన, కన్వీనర్ ఆచార్య సి.శోభా బిందు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మే 15 నుంచి 19వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈఏపీసెట్ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన అధికారులు.. మే 24 నుంచి 26వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతపురం జేఎన్టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.