* ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు
* మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం (ఏప్రిల్ 26) ప్రకటన విడుదల చేశారు. మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.
ప్రథమ సంవత్సరం
మే 24న ద్వితీయ భాష, 25న ఆంగ్లం మొదటి పేపర్, 28న మ్యాథ్స్-1ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్-1 పరీక్షలు, 29న మ్యాథ్స్-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు, 30న ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 పరీక్షలు, 31న కెమిస్ట్రీ-1, కామర్స్-1 పరీక్షలు, జూన్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-1 పరీక్షలు, జూన్ 3న మోడరన్ లాంగ్వేజీ-1, జాగ్రఫీ-1 పరీక్షలు జరుగుతాయి.
ద్వితీయ సంవత్సరం
24న ద్వితీయ భాష, 25న ఆంగ్లం పేపర్-2, 28న మ్యాథ్స్-2, బోటనీ-2, పొలిటికల్ సైన్స్-2 పరీక్షలు, 29న మ్యాథ్స్-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు, 30న ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2 పరీక్షలు, 31న కెమిస్ట్రీ-2, కామర్స్-2 పరీక్షలు, జూన్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్-2 పరీక్షలు, జూన్ 3న మోడరన్ లాంగ్వేజీ-2, జాగ్రఫీ-2 పరీక్షలు జరుగుతాయి. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్బోర్డు తెలిపింది. దీంతో పాటు ఇంటర్ ఒకేషనల్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.