• facebook
  • whatsapp
  • telegram

ESIC IP Quota Admission: ఈఎస్‌ఐసీ ఐపీ కోటా కింద దరఖాస్తుల ఆహ్వానం

* యూజీ-నీట్‌ 2024 అర్హత తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: ఈఎస్‌ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్‌స్యూర్డ్‌ పర్సన్స్‌’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్‌ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్‌ఐసీ ప్రకటన జారీ చేసింది. జాతీయ అర్హత పరీక్ష (యూజీ-నీట్‌)-2024లో అర్హత సాధించిన విద్యార్థులు దీని కింద సీట్లు పొందేందుకు అర్హులని తెలిపింది. అయితే అభ్యర్థులకు ఈఎస్‌ఐసీ జారీ చేసిన ‘వార్డ్‌ఆఫ్‌ ఇన్‌స్యూర్డ్‌ పర్సన్‌’ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈఎస్‌ఐసీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని,  మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మే 15 నాటికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈఎస్‌ఐసీ ఆధ్వర్యంలో 11 వైద్య కళాశాలలు, ఒక దంత వైద్య కళాశాల, రెండు నర్సింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వైద్య కళాశాలలో 466 సీట్లు, దంతవైద్య కళాశాలలో 28, నర్సింగ్‌లో 60 సీట్లు బీమా కార్మికులకు కేటాయించినట్లు పేర్కొంది. జాతీయ కోటా, రాష్ట్ర కోటా సీట్లు భర్తీ చేసిన తరువాత ఐపీ కోటా కింద సీట్లు కేటాయిస్తామని కార్పొరేషన్‌ తెలిపింది.



  వెబ్‌సైట్‌   

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.