• facebook
  • whatsapp
  • telegram

Free transportation: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించేందుకు వీలుకల్పిస్తూ యాజమాన్యం మార్చి 23న‌ ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు 3,348 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. హాల్‌టికెట్‌ను చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో వీరు ప్రయాణించొచ్చని, పరీక్షలు జరిగినన్ని రోజులూ ఈ వెసులుబాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో సంప్రదించి అవసరమైన మేరకు బస్సులు నడపాలని జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులను ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!

‣ గ్రూప్‌-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?

‣ రివిజన్‌..ప్రాక్టీస్‌.. సక్సెస్‌ సూత్రాలు!

‣ సీఆర్‌పీఎఫ్‌లోకి స్వాగతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.