ఈనాడు, అమరావతి: ఇంటర్లో ప్రవేశాల ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతలుగా ప్రవేశాలు నిర్వహించాలని పేర్కొంది. మొదటి విడతలో మే 15 నుంచి దరఖాస్తులు విక్రయించి, జూన్ 1 లోపు వాటిని స్వీకరించాలని సూచించింది. మే 22 నుంచి మొదటి విడత ప్రవేశాలు చేపట్టాలని, జూన్ 1 లోపు పూర్తి చేయాలని వెల్లడించింది. రెండో విడత ప్రవేశాలను జూన్ 10 నుంచి జులై 1 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.