* 48 ఏఈ ఎలక్ట్రికల్ పోస్టులు కూడా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్) 1,601 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 48 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)ఎలక్ట్రికల్, 1,553 జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టులు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలకు ఫిబ్రవరి 15 తర్వాత సంస్థ వెబ్సైట్లో చూడాలని ఎస్పీడీసీఎల్ వెల్లడించింది. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి గతేడాది మేలో జారీ చేసిన నోటిఫికేషన్ను ఆగస్టు నెలలో ఎస్పీడీసీఎల్ రద్దు చేసింది. జులై 17న జరిగిన రాత పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఉద్యోగార్థులు నష్టపోకూడదని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గతంలో 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సంఖ్య తాజా నోటిఫికేషన్లో 1,553కి పెరిగింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!
‣ వచ్చేస్తున్నాయ్... వర్చువల్ ల్యాబ్స్!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్గార్డ్ కొలువు కావాలా?
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.