• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 05-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. పదకొండు రాష్ట్రాల్లో మూడో దశ ఎన్నికలు!

మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఎన్నికలు జరిగే గుజరాత్, ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో చాలా చోట్ల గతంలో బీజేపీయే గెలుపొందింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. బాలల నేర న్యాయవ్యవస్థ సదస్సు

‘బాలల నేర న్యాయవ్యవస్థ’ అనే అంశంపై నేపాల్‌లో ఏర్పాటుచేసిన సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ హాజరయ్యారు. అందులో ప్రసంగిస్తూ.. ‘‘పిల్లలతో ఉపాధ్యాయుల ప్రవర్తనా విధానం వారి మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది.   పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. అల్‌-జజీరా వార్తా ఛానల్‌పై నిషేధం

హమాస్‌కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్‌-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్‌పై ఇజ్రాయెల్‌ నిషేధం విధించింది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలో మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. బజ్‌రంగ్‌ను సస్పెండ్‌ చేసిన నాడా

స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియాను జాతీయ డోపింగ్‌ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్‌ చేసింది. ఇటీవల ట్రయల్స్‌ సందర్భంగా డోప్‌ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  ప్రజారోగ్యశాఖ ఈఎన్‌సీగా జియాఉద్దీన్‌

రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌)గా జియాఉద్దీన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్‌.శ్రీధర్‌ ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ జియాఉద్దీన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.