* ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 30న విడుదల
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం (ఏప్రిల్ 27) నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 1,59,989 మంది నమోదు చేసుకోగా, 1,41,978 మంది పరీక్ష రాసినట్లు ఓ ప్రకటనలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు. ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 30న విడుదల చేస్తామన్నారు. ఫలితాలను మే 10లోపు విడుదల చేసి, విద్యా సంవత్సరాన్ని జూన్ మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.