చెట్ల కింద తరగతులు వింటున్న విద్యార్థుల ఈ చిత్రం జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి మండలం నందిన్నె జడ్పీ ఉన్నత పాఠశాలలోనిది. ఈ బడిలో 492 మంది విద్యార్థులు చదువుతుండగా.. ప్రధానోపాధ్యాయుడు, పీఈటీతో కలిపి 11 మంది ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు కలిపి 15 సెక్షన్లు ఉండగా పాఠశాలలో తరగతులు నిర్వహించడానికి అనుకూలంగా ఉన్నవి అయిదు గదులే. దీంతో ఆంగ్ల మాధ్యమ తరగతులను పాఠశాల ఆవరణలోని చెట్ల కింద నిర్వహిస్తున్నారు. తెలుగు మాధ్యమంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సెక్షన్లు చేయగా వాటికి కూడా తరగతి గదుల కొరత నెలకొందని ఉపాధ్యాయులు తెలిపారు. పేరుకు సక్సెస్ పాఠశాల అయినా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రధానోపాధ్యాయుడు మహేష్ ‘ఈనాడు’కు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్!
‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?
‣ మేనేజ్మెంట్ కోర్సుల్లోకి ‘మ్యాట్’!
‣ డెకరేషన్లకు కొన్ని కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.