ఈనాడు, హైదరాబాద్: ప్రైవేట్ కళాశాలలకు యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చే ప్రక్రియలో విశ్వవిద్యాలయాల పెత్తనానికి యూజీసీ కోత పెడుతోంది. ఇప్పటివరకు ఆయా కళాశాలలు అటానమస్ హోదా దరఖాస్తును విశ్వవిద్యాలయం ద్వారానే యూజీసీకి పంపించాల్సి ఉండేది. మొదట వర్సిటీ కమిటీ.. కళాశాలను తనిఖీ చేసి... స్వయంప్రతిపత్తి పొందేందుకు అర్హత ఉందని నివేదిక ఇవ్వాలి. అప్పుడు దాన్ని పరిశీలించి యూజీసీ అనుమతి ఇస్తుంది. దీనికి సంబంధించి 2018 నాటి యూజీసీ నియమావళిలో సవరణలు చేస్తూ ముసాయిదా నివేదికను కమిషన్ ఇటీవల విడుదల చేసింది. ఆ ప్రకారం ఇకపై కళాశాలలు నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు దరఖాస్తును కమిషన్ తమ పోర్టల్లో ఉంచుతుంది. సంబంధిత వర్సిటీ 30 రోజుల్లోపు అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలపాలి. ఒకవేళ ఏమీ చెప్పకుంటే ఆ కళాశాలలకు అటానమస్ హోదా జారీ చేస్తారు. అయితే కళాశాలను ఏర్పాటుచేసి 10 సంవత్సరాలై ఉండాలి. న్యాక్ ‘ఎ’ గ్రేడ్ లాంటి అర్హత నిబంధనలను యథావిధిగానే ఉంచారు. తొలుత పదేళ్లపాటు అటానమస్ హోదా ఇస్తారు. మొత్తం 15 ఏళ్లు ఆ హోదాను కొనసాగించగలిగితే ఇక శాశ్వత అటానమస్ కళాశాలగా అనుమతి ఇస్తారు.
‣ కళాశాలలు పంపిన దరఖాస్తులను కొన్ని విశ్వవిద్యాలయాలు పెండింగ్లో ఉంచి, లాభార్జనకు వాడుకుంటున్నాయని, యాజమాన్యాలను తిప్పలు పెడుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే నిబంధనలను సవరిస్తున్నట్లు భావిస్తున్నారు. దానికితోడు జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం భవిష్యత్తులో కేవలం డిగ్రీ పట్టాలిచ్చేలా స్వయంప్రతిపత్తి విద్యాసంస్థలే ఉండాలని, అనుబంధ కళాశాలలు ఉండరాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా సవరణలకు అది కూడా ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫారిన్ ట్రేడ్.. అద్భుత కెరియర్!
‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు
‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!
‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?
‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.