* అపరాధ రుసుంతో మే 12 వరకూ అవకాశం
కాకినాడ(గాంధీనగర్), న్యూస్టుడే: ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారం (ఏప్రిల్ 15) తో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్కు 2,68,309 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 84,791 మంది, రెండు విభాగాలకు 1135 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య పెరిగిందన్నారు. ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంజినీరింగ్ విభాగానికి మే 18 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. దరఖాస్తులు ఎక్కువ రావడంతో 23వ తేదీ ఉదయం సెషన్లోనూ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17న పరీక్షలు ఉంటాయని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.1000తో మే 5 వరకు, రూ.5 వేలతో మే 10 వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.