ఈనాడు, హైదరాబాద్: రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి శనివారం నిర్వహించిన డీఈఈసెట్కు 11,680 మందికిగాను 8,645 మంది(74 శాతం) హాజరయ్యారని కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. తెలుగు మాధ్యమానికి 3,572 మంది, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలకు కలిపి 5,073 మంది పరీక్ష రాశారని ఆయన వివరించారు. ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 27వ తేదీలోపు వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు.
పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలనకు 26,169 మంది హాజరు
పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన శనివారంతో ముగియగా మొత్తం 26,169 మంది హాజరయ్యారు. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈ నెల 25వ తేదీ తుది గడువు. శనివారం వరకు 13,358 మంది ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారని పాలిసెట్ క్యాంప్ అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.