* అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ వర్సిటీ బంపర్ ఆఫర్
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్ ఆనంద్వాడేకు అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్షిప్ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్షిప్ లేఖను పంపింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐసీఎస్ఈ సిలబస్తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్ అమెరికాలో న్యూరోసైన్స్ చదవనున్నాడు. విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది. ఆగస్టు 12న వేదాంత్ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని, 17 మంది నోబెల్ పురస్కార గ్రహీతలను అందించిందన్నాడు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్ ఫీజు మేరకు స్కాలర్షిప్ లభించిందన్నారు. నాన్న ప్రైవేట్ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా, అమ్మ ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నారని వేదాంత్ తెలిపాడు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష
‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!
‣ దేశ రాజధానిలో టీచింగ్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.