ఈనాడు, అమరావతి: ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్కు వైస్ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుల ఎంపికపై సెర్చ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్గా నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. యూపీఎస్సీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, ఐఐఎం డైరెక్టర్ చంద్రశేఖర్, ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి బీలా సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారీ, దరఖాస్తులు స్వీకరణ, అర్హుల ఎంపికకు సెర్చి కమిటీకి 40 రోజులకుపైగా సమయం పడుతుంది. ప్రస్తుత కమిషన్ వైస్ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుల పదవీకాలం ఇప్పటికే ముగిసిపోగా, నెల రోజులు పొడిగింపు ఇచ్చారు. సెర్చి కమిటీ పని పూర్తయ్యేలోగా వీరి పొడిగించిన కాలం కూడా గడిచిపోతుంది. కాబట్టి కొత్తవారిని నియమించేలోగా కమిషన్ పదవీకాలాన్ని మరోసారి పొడిగించాల్సి వస్తుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.