కళాశాలలకు అనుబంధ గుర్తింపు దక్కని ఫలితం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఇంటర్ బోర్డు లెక్కల్లో నమోదు కాలేదు. ఈసారి ఇప్పటివరకు సుమారు 3.90 లక్షల మందే ప్రవేశాలు పొందినట్లు బోర్డులో నమోదైంది. ప్రభుత్వ రంగంలోని 1,060 కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా.. 120కిపైగా కళాశాలల అనుమతులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సుమారు 1,080 ప్రైవేట్ కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చారు. మరో 200 కళాశాలల అనుమతి వివిధ స్థాయుల్లో పెండింగ్లో ఉంది. 340కిపైగా కళాశాలలు వాణిజ్య, గృహ సముదాయాల్లో కొనసాగుతుండటంతో మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ లేకపోవడంతో అనుమతుల వ్యవహారం సందిగ్ధంలో పడింది. వాటిలో చదువుతున్న సుమారు లక్ష మంది విద్యార్థుల పేర్లు బోర్డు లెక్కల్లో నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కళాశాలలపై ప్రభుత్వం నిర్ణయం వెలువడితే తప్ప పరీక్షల రుసుం చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కాదని బోర్డు వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.