ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జాతీయ కెరీర్ సర్వీసు(ఎన్సీఎస్) ఆధ్వర్యంలో మే 26న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రాంతీయ ఉపాధి కల్పన అధికారి భూక్యా కాసీం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యానగర్లోని జాతీయ నైపుణ్య శిక్షణ క్యాంపస్లో మేళా కొనసాగుతుందన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 10 ప్రముఖ కంపెనీల్లో 645 ఉద్యోగాలు ఉన్నాయని, అర్హులైన ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులు నేషనల్ కెరీర్ సర్వీసు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.