ఈనాడు, హైదరాబాద్: సంక్షేమ గురుకులాల్లో అత్యధిక పోస్టులతో వెలువడిన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మే 27తో ముగియనుంది. గురుకులాల్లో వివిధ రకాల మొత్తం 9,210 పోస్టులకు గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను వెలువరించింది. ఇందులో 4,006 టీజీటీ పోస్టులున్నాయి. డిగ్రీ, టెట్ అర్హతతో కూడిన ఈ పోస్టులకు భారీసంఖ్యలో దరఖాస్తులు వస్తాయని బోర్డు అంచనా వేస్తోంది. చివరి తేదీన అధికసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుకు ప్రయత్నిస్తుండటంతో సర్వర్పై ఒత్తిడి పెరుగుతోందని, ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు వేచిచూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని బోర్డు వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే 8 నోటిఫికేషన్లకు దరఖాస్తు గడువు ముగిసింది. వాటికి దరఖాస్తు గడువు పొడిగించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేసినా, గురుకుల బోర్డు అనుమతించలేదు. టీజీటీ ఉద్యోగాలకూ దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం లేదని బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 28 నుంచి మొదలైన టీజీటీ ఉద్యోగాల దరఖాస్తు స్వీకరణ గడువు మే 27వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గ్రూపు-1, 2 పోస్టుల భర్తీ
‣ రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.