చెన్నై(వడపళని), న్యూస్టుడే: ‘ఎండీ-పీహెచ్డీ’ డ్యూయల్ డిగ్రీ అందించేందుకు చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎస్ఆర్ఐహెచ్ఈఆర్)తో ఐఐటీ మద్రాస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్ఆర్ఐహెచ్ఈఆర్ ఉపకులపతి ఉమా శేఖర్, ఐఐటీఎం డైరెక్టర్, ఆచార్యులు కామకోటి నవంబరు 16న ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. పీజీ వైద్య డిగ్రీ ఎస్ఆర్ఐహెచ్ఈఆర్, పీహెచ్డీని ఐఐటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అందించనున్నాయి. కామకోటి మాట్లాడుతూ ‘డ్యూయల్ డిగ్రీ కోర్సు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. నీట్ రాసి ఎస్ఆర్ఐహెచ్ఈఆర్లో పీజీ కోర్సులో చేరినవారు పీహెచ్డీ చేయాలనుకుంటే రెండో సంవత్సరంలో ఐఐటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది’ అని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.