ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల కొందరు ఎకనామిక్స్ అభ్యర్థులు నష్టపోయారు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో నాలుగు పోస్టులకు అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ అభ్యర్థులు అర్హులు కాగా.. ఆన్లైన్లో అప్లైడ్ ఎకనామిక్స్ మాత్రమే చూపారు. ఎకనామిక్స్ కోసం వెదికిన వారికి ఈ వర్సిటీ కనిపించకపోవడంతో దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని వర్సిటీలకు ఒకేసారి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ విధానం తీసుకురాగా.. ఆ గడువు సోమవారంతో ముగిసింది. మధ్యలో సర్వర్ సమస్య తలెత్తడంతో కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో అభ్యర్థులు.. మళ్లీ అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నత విద్యామండలికి ఫోన్లు, ఈ-మెయిల్ ద్వారా వినతులు సమర్పిస్తున్నారు. సాధారణంగా ఏ దరఖాస్తులైనా అర్ధరాత్రి 12 గంటల వరకు స్వీకరిస్తారు. కానీ వర్సిటీ అధ్యాపక పోస్టుల విషయంలో సాయంత్రం అయిదు గంటలకే నిలిపేశారు. దీనిపై అభ్యర్థులు సమయం ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.