కరెన్సీనగర్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు పలు అంశాలపై ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగా నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని స్కిల్ హబ్ కేంద్రంలో ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సు మూడో బ్యాచ్ ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి.నరేష్ కుమార్ నవంబరు 22న తెలిపారు. నవంబరు 27వ తేదీ నుంచి కొత్త కోర్సు మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో వనరులు, బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచకొని మూడు నెలల నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఈ కోర్సులో చేరేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 83282 52829 నెంబరులో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
ఎల్బీఎస్ఐఎమ్లో పీజీ డిప్లొమా కోర్సులు
వైజాగ్ నావల్ డాక్యార్డులో 275 అప్రెంటిస్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.