• facebook
  • whatsapp
  • telegram

Scholarships: భారతీయ విద్యార్థులకు 100 ఉపకార వేతనాలు

* యూసీఎల్‌ ప్రకటన
 

లండన్‌: ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులు బ్రిటన్‌లో చదివేందుకు ప్రోత్సహించేలా యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌) కొత్తగా వంద ఉపకార వేతనాల పథకాన్ని ప్రకటించింది. అలాగే దేశంలోని ప్రీ యూనివర్సిటీ విద్యార్థుల కోసం మొదటిసారిగా సమ్మర్‌ స్కూలును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. బ్రిటన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూసీఎల్‌.. తాము ప్రకటించిన కొత్త ఉపకార వేతనాలు ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులు పూర్తిస్థాయి మాస్టర్‌ డిగ్రీ చేసేందుకు దోహదపడతాయని న‌వంబ‌రు 22న పేర్కొంది. 2024-25 విద్యా సంవత్సరంలో అర్హులైన 33 మంది విద్యార్థులకు ఈ ఉపకార వేతనాల సదుపాయం కల్పిస్తామని, తదుపరి రెండేళ్లలో మిగతా 67 మందికి అందేలా చూస్తామని తెలిపింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా యూసీఎల్‌ విద్యార్థుల్లో భారతీయులు ముఖ్య భాగంగా ఉన్నారు. ఈ ప్రత్యేక సదుపాయం భారత్‌తో మా సంబంధాలను బలోపేతం చేస్తుంది’’ అని యూసీఎల్‌ చీఫ్‌ డాక్టర్‌ మేకేల్‌ స్పెన్స్‌ తెలిపారు. ఈ ఉపకార వేతనాల కింద విద్యార్థులకు రూ.5.21 లక్షల (5,000 పౌండ్లు) ఆర్థికసాయం అందుతుంది.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ జేఈఈ మెయిన్‌ విజయానికి కీలకాంశాలు

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ ఎయిమ్స్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.