ఆదేశాలు జారీ చేసిన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల తనిఖీల పేరుతో ఇప్పటివరకు ఉపాధ్యాయులను హడలెత్తించిన ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. ఇప్పుడు వాట్సప్ వీడియో కాల్ తనిఖీలకు సిద్ధమయ్యారు. నవంబరు 27న సాయంత్రం 6.30గంటలకు వాట్సప్లో విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి నోటుబుక్స్, వర్క్ బుక్స్తో పాటు సమ్మెటివ్-1 పరీక్షకు సిలబస్ పూర్తి చేయడాన్ని పరిశీలిస్తానని, ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులందరికీ పంపించాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాట్సప్ వీడియో కాల్లో పిల్లల నోటుబుక్స్, వర్క్ బుక్స్ చూపించేలా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పరీక్షలకు సిలబస్ పూర్తికాని పరిస్థితి ఉండకూడదని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!
‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు
‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.