న్యాయస్థానం వద్దన్నా రహస్యంగా అధ్యాపక పోస్టుల ప్రొవిజినల్ జాబితాలు
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చాలా వర్సిటీలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నిర్వహించిన హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్ను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నవంబరు 16న విచారణ జరిపిన న్యాయస్థానం ఆన్లైన్ విధానంతోపాటు నేరుగా దరఖాస్తుల్ని స్వీకరించవచ్చని సూచించింది. వీటి ఆధారంగా ప్రొవిజినల్ జాబితా జారీ ప్రక్రియను చేపట్టవద్దని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చాలా వర్సిటీలు దరఖాస్తుల పరిశీలనకు కమిటీలను నియమించాయి. విక్రమ సింహపురి వర్సిటీ సైతం ముందుగా పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసి, ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విజయనగరం జేఎన్టీయూ రిజిస్ట్రార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరికొన్ని వర్సిటీలు ప్రొవిజినల్ జాబితా జారీకి రహస్యంగా చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాయలసీమలోని రెండు ప్రముఖ వర్సిటీలు సైతం ప్రొవిజినల్ జాబితాల రూపకల్పనకు కమిటీలను ఏర్పాటు చేశాయి. హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్పై వ్యాజ్యాలను హైకోర్టు డిసెంబరు 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రొవిజినల్ జాబితాలను రూపొందించొద్దని ఆదేశించింది. హడావుడిగా నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యాశాఖ రహస్యంగా ఆదేశాలు ఇస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!
‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు
‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.