• facebook
  • whatsapp
  • telegram

Versity Professor Posts: దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు మాయం

* వర్సిటీ అధ్యాపక పోస్టుల్లో ప్రకటించని వైనం



ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు మాయమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను ప్రకటించిన ప్రభుత్వం దివ్యాంగుల పోస్టులను మాత్రం వెల్లడించలేదు. చాలా వర్సిటీల్లో 2 నుంచి 4 వరకు ఉన్న ఈ పోస్టులను జనరల్‌ కేటగిరీలో కలిపేసింది. దీంతో దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వికలాంగుల హక్కుల చట్టం-2016 సెక్షన్‌ 34(2) ప్రకారం నియామక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థులు రాకపోతే మరోసారి  ప్రకటన ఇవ్వాలి. రెండో సారీ రాని పక్షంలో ప్రభుత్వ అనుమతితో మార్పు చేయాలి. కానీ, విభాగాల విలీనం సమయంలో పోస్టులను కలిపేసి, హేతుబద్ధీకరణ చేశారు. దీంతో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు కనిపించకుండా పోయాయి.

బ్యాక్‌లాగ్‌ పోస్టులకూ స్క్రీనింగ్‌ పరీక్షా?

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఎలాంటి స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించకూడదని, అర్హతల ఆధారంగా ఇవ్వాలని ఆదేశాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుందని ప్రకటించింది. సహాయ ఆచార్యుల బ్యాక్‌లాగ్‌ పోస్టులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. విచిత్రమేమిటంటే బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దరఖాస్తు చేస్తే అదనంగా ఫీజును వసూలు చేసింది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ మాట్లాడే సీఎం జగన్‌ వారికే అన్యాయం చేస్తున్నారు. అదనపు ఫీజులు వసూలు చేసి, పేద నిరుద్యోగ అభ్యర్థులపై అదనపు భారం వేశారు.
 

* వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) స్కేల్స్‌ ఇవ్వకుండా వారి శ్రమ దోపిడీ చేస్తున్న ప్రభుత్వం.. వారిని అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు అనర్హులుగా తేల్చింది. వర్సిటీల్లో సహాయ ఆచార్యులుగా ఒప్పంద ప్రాతిపదికన చాలా మంది పదేళ్లకు పైనుంచి పని చేస్తున్నారు. వీరు అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే యూజీసీ స్కేల్స్‌ తీసుకుని ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. ప్రభుత్వమే యూజీసీ స్కేల్‌ ఇవ్వకుండా.. వారు ఆ స్కేల్‌ తీసుకోవడం లేదని అనర్హులంటోంది. ప్రైవేటులో పని చేస్తున్న వారు కొందరు యూజీసీ స్కేల్స్‌ తీసుకుంటున్నట్లు సర్టిఫికెట్లు సిద్ధం చేసుకుంటుంటే.. వర్సిటీల్లో పని చేస్తున్న వారు అనర్హులుగా మిగిలిపోయారు.



 

మరింత సమాచారం... మీ కోసం!

 డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.