విచారణకు గైర్హాజరైన రాయలసీమ వర్సిటీ ఉపకులపతి(వీసీ) ఆనందరావు, రిజిస్ట్రార్ శ్రీనివాసులుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై నాన్బెయిలబుల్ వారంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీచేసింది. వారిద్దరిని కోర్టు ముందు హాజరుపరచాలంటూ పోలీసులను ఆదేశిస్తూ విచారణను జనవరి 5కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఎంఈడీ కౌన్సెలింగ్కు అనుమతివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ రెండు కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా.. కౌన్సెలింగ్కు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టు ఉత్తర్వులు అమలుకాకపోవడంతో కళాశాల యాజమాన్యం.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు డిసెంబరు 5న తమ ముందు హాజరుకావాలని వీసీ, రిజిస్ట్రార్ను.. న్యాయస్థానం ఆదేశించింది. డిసెంబరు 5న విచారణకు హాజరుకాకపోవడంతో వారిపై ఎన్బీడబ్ల్యూ జారీచేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ నేషనల్ ఫెర్టిలైజర్స్లో మేనేజ్మెంట్ ట్రైనీలు
‣ ఆన్క్యాంపస్, ఆఫ్క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.