* యాప్ను ఆవిష్కరించిన స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్
ఈనాడు, హైదరాబాద్: ప్రాంగణ నియామకాలు జరగని కళాశాలల విద్యార్థుల కోసం ‘స్టూడెంట్ ట్రైబ్’ యాప్ను డిసెంబరు 14న హైదరాబాద్లోని టీహబ్లో ఆవిష్కరించారు. విద్యార్థులు వారికి నచ్చిన రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ‘స్టూమాగ్జ్’ సంస్థ ప్రతినిధులు ఈ యాప్కు శ్రీకారం చుట్టారు. లింక్డ్ఇన్ తరహాలోనే ఇది ఉచిత సేవలు అందిస్తుందని యాప్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు తెలిపారు. నైపుణ్యాల ఆధారంగా కెరీర్ ఎంపిక, గ్రూప్ డీల్స్ ద్వారా కోర్సుల ఫీజుల్లో రాయితీలు, ఇంటర్న్షిప్.. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూల సాధన, రెజ్యుమె రూపొందించడం, ఈవెంట్లు, యూత్ ఫెస్టివల్స్ సమాచారం తదితర అంశాల్లో మార్గనిర్దేశం చేసేలా దీనిని రూపొందించామన్నారు. తొలుత ప్రయోగాత్మకంగా వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురాగా 1500 కళాశాలల నుంచి 5 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారని, మరింత మందికి చేరువ చేసేందుకు ఉచిత యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా నైపుణ్యాలు బేరీజు వేస్తూ కోర్సుల వివరాలు ప్రత్యక్షమవుతాయని, సరైన సదుపాయాలు లేని కళాశాలల్లో చదివే విద్యార్థులకు మార్గనిర్దేశకుల కొరత తీర్చేలా ‘యాక్సెస్ టు మెంటార్’ సెషన్లు, బహుళజాతి సంస్థలు, ఏఐ హెడ్లతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో సినీనటులు విరాజిత, రవి శివతేజ, ఇన్ఫినిటమ్ మీడియా సీఈవో రాహుల్ రాఘవేంద్ర, భారత్ అప్స్కిల్ వ్యవస్థాపకుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.