• facebook
  • whatsapp
  • telegram

Yuvanidhi: కర్ణాటకలో ‘యువనిధి’ ప్రారంభం

* 5.3 లక్షల నిరుద్యోగులకు ఉపకారం

ఈనాడు, బెంగళూరు: ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఐదు ‘గ్యారంటీ’ పథకాల్లో చివరిదైన ‘యువనిధి’ డిసెంబ‌రు 26న‌ ప్రారంభమైంది. ఈ పథకానికి అర్హులైన 5.3 లక్షల మంది డిగ్రీ, డిప్లొమా పట్టభద్రులు దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ శరణ్‌ ప్రకాశ్‌పాటిల్‌ ఈ నమోదు ప్రక్రియను బెంగళూరులోని విధానసౌధలో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ.. ‘కర్ణాటక ప్రభుత్వం ఈ గ్యారంటీలు అమలు చేయలేదు’ అంటూ ప్రధాని మోదీ ఓ ఆర్థిక నిపుణుడిలా విశ్లేషించారని తప్పుపట్టారు. ఆయన అంచనా తప్పని తాము నిరూపించామన్నారు. అర్హులకు జనవరి 12 వివేకానంద జయంతి నాడు డిగ్రీ పట్టభద్రులకు నెలకు రూ.3 వేలు, డిప్లొమా నిరుద్యోగులకు రూ.1500 చొప్పున వారి ఖాతాలకు నగదు బదిలీ చేస్తామన్నారు.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.