1. పద్మ అవార్డులు 2024 ప్రకటన
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించింది. కళ, సామాజికసేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్రసాంకేతికం, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపికచేసి గౌరవిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బాలచంద్ర ప్రమాణస్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే ప్రమాణస్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలోని కోర్టు నంబరు 1లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా మహేందర్రెడ్డి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు (టీఎస్పీఎస్సీకి) ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్తో పాటు మరో అయిదుగురు సభ్యులున్నారు. ఛైర్మన్గా విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, సభ్యులుగా గతంలో ఛైర్మన్గా వ్యవహరించిన బి.జనార్దన్రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారత సంతతి న్యాయవాది అజిత్ మిశ్రకు ‘లండన్’ అవార్డు
బ్రిటన్లోని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది అజిత్ మిశ్రకు ప్రతిష్ఠాత్మక ‘ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్’ అవార్డు దక్కింది. యూకే, ఇండియా లీగల్ పార్ట్నర్షిప్ (యూకేఐఎల్పీ)కు వ్యవస్థాపక అధ్యక్షుడైన అజిత్ అక్కడ అందించిన న్యాయ, ప్రజాసేవలకు గుర్తింపుగా జనవరి 23న ఈ అవార్డు ప్రదానం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5.ఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్లో తెలంగాణకు రెండు పతకాలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023లో అథ్లెటిక్స్లో తెలంగాణ ఒక గోల్డ్, మరో సిల్వర్ కలిపి రెండు పతకాలు సాధించింది. జనవరి 19న చెన్నైలో మొదలైన పోటీలు 31న ముగియనున్నాయి. ఇందులో భాగంగా 23 నుంచి 25 మధ్య మూడు రోజులపాటు నిర్వహించినm అథ్లెటిక్స్లో పతకాల సాధనలో ఏపీకి చోటు దక్కలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.