* త్వరలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
* తాజాగా ప్రకటన జారీ
ఈనాడు ప్రతిభ డెస్క్: ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. తాజాగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ కొలువులకు ఆర్ఆర్బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో అభ్యర్థుల వయోపరిమితి 18-30 ఏళ్లని పేర్కొనగా.. దీన్ని పెంచుతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఏఎల్పీ ఖాళీలకు జులై 1వ తేదీ నాటికి 18-33 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చని ప్రకటించింది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది. త్వరలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఏఎల్పీ నోటిఫికేషన్, స్టడీ మెటీరియల్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.