• facebook
  • whatsapp
  • telegram

NEET 2024 notification: నీట్ యూజీ 2024 దరఖాస్తులు షురూ

* మే 5వ తేదీన పరీక్ష 

* సిలబస్‌లో మార్పులు 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (నీట్‌ యూజీ 2024) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. నీట్‌ యూజీ సిలబస్‌లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్ యూజీ-2024 నూతన సిలబస్‌కు సంబంధించి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో మార్పులు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా వివరాలను ప్రకటించింది. 

అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్/ ప్రీ-డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు రుసుం: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,700 కాగా, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్‌ జండర్‌ అభ్యర్థులు రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. 

దరఖాస్తు తేదీలు:  ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9వ వరకు చేసుకోవచ్చు.




  నీట్ యూజీ 2024 నోటిఫికేషన్‌  


  సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి  



  వెబ్‌సైట్   


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.