* మే 5వ తేదీన పరీక్ష
* సిలబస్లో మార్పులు
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (నీట్ యూజీ 2024) పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. నీట్ యూజీ సిలబస్లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్ యూజీ-2024 నూతన సిలబస్కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో మార్పులు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా వివరాలను ప్రకటించింది.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్లో ఇంటర్మీడియట్/ ప్రీ-డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు.
దరఖాస్తు తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9వ వరకు చేసుకోవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.