ఈనాడు, అమరావతి: విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని వైద్య కళాశాలల్లో జరిగే ఎంబీబీఎస్ సహా అన్ని పరీక్షల జవాబు పత్రాలను ఎక్కడికక్కడే స్కానింగ్ చేయాలన్న కొత్త విధానం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం పరీక్షలు ముగియగానే జవాబు పత్రాలను జాగ్రత్తగా విజయవాడకు పంపిస్తున్నారు. ఇక్కడ వాటిని పొరుగు సేవల సిబ్బందితో డిజిటల్ స్కాన్ చేయించి, మూల్యాంకనానికి సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఖర్చుతో పాటు స్కానింగ్ సరిగ్గా లేక మూల్యాంకనం కష్టమవుతోందని అధ్యాపకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అయితే, మరింత మెరుగైన స్కానింగ్ పద్ధతులను అందిపుచ్చుకోవాల్సింది పోయి, ‘రివర్స్’ నిర్ణయం తీసుకున్నారు.
అక్రమాల నియంత్రణ ఎలా?: పరీక్షలు పూర్తయ్యాక జవాబుపత్రాలను అదే కళాశాలలో స్కానింగ్ కోసం ఉంచితే.. అక్రమాలకు తావిచ్చినట్లేనన్న విమర్శలు వస్తున్నాయి. జవాబు పత్రాలను మార్చవచ్చని, దిద్దవచ్చని అంటున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, వర్సిటీ నియమించిన పరిశీలకుల సమక్షంలోనే అక్రమాలకు వీల్లేకుండా స్కానింగ్ చేయిస్తామని చెబుతున్నా.. ఆచరణలో అది సాధ్యమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కళాశాలల నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉండే పర్యవేక్షకులను నియమించుకుంటున్నారు. అలాంటి వారి సమక్షంలో జవాబుపత్రాల స్కానింగ్ ఎంతవరకు పారదర్శకంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. పరీక్షలు ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడించాలనే లక్ష్యంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిహెచ్.శ్రీనివాసరావు వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.