* ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
అమరావతి: ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. 899 గ్రూప్-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల మంది ఈ పరీక్ష రాశారని ఆయన తెలిపారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని చెప్పారు. ‘చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నాం. నకిలీ హాల్టికెట్ తయారు చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాం. జూన్ లేదా జులైలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఉంటాయి. మార్చి 17న గ్రూప్-1 పరీక్ష ఉంటుంది. వాయిదా వదంతులు నమ్మకుండా పరీక్షకు సిద్ధం కావాలి’ అని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.