* కొత్త డీఎస్సీలో పోస్టులు పెరిగిన ఫలితం
ఈనాడు, హైదరాబాద్: మెగా డీఎస్సీ కారణంగా ఈసారి 33 జిల్లాల్లో దాదాపు అన్ని సబ్జెక్టుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క ఆంగ్లం సబ్జెక్టులో మాత్రమే రెండు జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. పాత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,739 మాత్రమే చూపారు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం, 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో ఖాళీలు లేవు. ఈసారి పోస్టుల్ని 2,629కి పెంచారు. అందుకే మొత్తం 33 జిల్లాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా ఒక జిల్లాలో అయిదు ఖాళీలుంటే.. అత్యధికంగా 41 ఉన్నాయి. ఈ సబ్జెక్టులో 32 జిల్లాల్లో రెండంకెల్లోనే ఖాళీలున్నాయి. ఫలితంగా ఈసారి దరఖాస్తులు లక్షన్నర వరకు పెరగవచ్చని అంచనా. పాత డీఎస్సీకి 1.77 లక్షల దరఖాస్తులందాయి. తాజా నోటిఫికేషన్తో శనివారం వరకు 6 వేల దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 2 వరకు గడువు ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.