ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ మినహా మిగతా ఐదు జిల్లాల కేజీబీవీల్లో చదివే బాలికల ఆసక్తిని గమనించి హసన్పర్తి కేజీబీవీ కేంద్రంగా ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ సహా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ శిక్షణ కోసం జరిగే ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్న విషయం విధితమే. స్వల్ప, దీర్ఘకాల శిక్షణ ఇచ్చే సంస్థలకు తీసిపోని విధంగా కోచింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాక విద్యార్థుల మానసికోల్లాసానికి వినోద కార్యక్రమాలు చేపడుతున్నారు. స్లిప్టెస్టులు పెట్టి, వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
హసన్పర్తి కోచింగ్ సెంటర్లో మొత్తం 154 మంది బాలికలు చేరారు. ఇరవైనాలుగు మంది స్ట్రాంగ్ పీజీసీఆర్టీలు సహా మరో 24 మంది ట్యూటర్లను నియమించారు. ఎంసెట్ను గమనంలోకి తీసుకుని హైదరాబాద్ నుంచి నిపుణులు తయారు చేసిన కాలనిర్ణయ పట్టికను అనుసరిస్తున్నారు. హైదరాబాదు నుంచే మనోవికాస నిపుణులు, ఎంసెట్ ప్రశ్నపత్రం అధ్యయనం చేసిన నిపుణులు ప్రతి కేంద్రానికి తరలించే యోచనలో విద్యాశాఖ ఉందని సమాచారం. పరీక్ష జరిగే వరకు శిక్షణ కొనసాగుతుందని అధికారులు చెపుతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.