రాష్ట్రపతికి ఖర్గే లేఖ
దిల్లీ: దేశంలోని సైనిక్ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని, ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. ‘రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ద్వారా దేశంలో 33 సైనిక్ స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఇంతవరకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నాయి. ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుంది. ఒక సిద్ధాంతాన్ని వీటిద్వారా రుద్దేందుకు ప్రయత్నించడం తగదు. దేశ సేవకు కావాల్సిన లక్షణాలను, దార్శనికతను ఈ పాఠశాలల్లోని విద్యార్థులు నిలుపుకోవాలంటే ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే 62% పాఠశాలల్ని భాజపా-ఆరెస్సెస్ నేతలే సొంతం చేసుకోనున్నారు’ అని ఖర్గే తన లేఖలో తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.