• facebook
  • whatsapp
  • telegram

Navodaya: నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం


చొప్పదండి, న్యూస్‌టుడే: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2025 - 26 విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలని, విద్యార్థులు తప్పనిసరిగా ఉమ్మడి జిల్లా పరిధిలో నివసిస్తూ ఉండాలని కోరారు. అభ్యర్థులు 01.05.2013 నుంచి 31.07.2017 మధ్య జన్మించి ఉండాలని, మూడు, నాలుగు, అయిదు తరగతులు ప్రభుత్వ లేదా ప్రభుత్వామోదిత పాఠశాలల్లో చదువుతూ ఉండాలన్నారు. దరఖాస్తులు అంతర్జాలం ద్వారా 16.09.2024 లోపు సమర్పించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష తేది 18.01.2025 ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.