* పోస్టల్ జాబ్ ప్రమోషన్ ప్రక్రియ
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ తపాలా సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 1,355, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
విధులు, జీతం వివరాలు...
నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది. జీడీఎస్ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది.
సర్వీసు, పదోన్నతి ప్రక్రియ...
బ్రాంచ్పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్కు శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎంటీఎస్, పోస్టుమెన్, మెయిల్ గార్డు, క్లర్క్... మొదలైన పదోన్నతులు పొందవచ్చు. మూడేళ్ల సర్వీసు ఉన్న జీడీఎస్ ఉద్యోగులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) డిపార్ట్మెంటల్ పరీక్ష రాసి పదోన్నతి పొందితే రూ.18 వేల మూల వేతనం పొందవచ్చు. ఐదేళ్ల సర్వీసు ఉన్న జీడీఎస్ ఉద్యోగులు పోస్ట్మ్యాన్ డిపార్ట్మెంటల్ పరీక్ష రాసి పదోన్నతి పొందితే రూ.21 వేల మూల వేతనం అందుతుంది. అలాగే జీడీఎస్ ఉద్యోగంలో చేరిన సంవత్సరం ఆధారంగా ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి ఐదు/ ఎనిమిదేళ్లకు పోస్టల్ అసిస్టెంట్ డిపార్ట్మెంటల్ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షలో ఎంపికైతే రూ.25,500 మూల వేతనం అందుతుంది. పదోన్నతి పొందిన జీడీఎస్లు వారి సర్వీసు ఆధారంగా భవిష్యత్తులో ఇతర పోస్టులకు నిర్వహించే శాఖాపరమైన పరీక్షలకు అర్హులవుతారు.
తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.