* ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
ఈనాడు, అమరావతి: పదో తరగతిలో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 7న నిర్వహించే పబ్లిక్ పరీక్షలతో పాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ విధానం ఉంటుంది. 2022లో నిర్వహించే పరీక్షలకు మాత్రం 11పేపర్లు ఉంటాయని పేర్కొన్నారు. భౌతిక, జీవశాస్త్రం మినహా మిగతా ఐదు సబ్జెక్టుల పేపర్లు వంద మార్కులకు ఉంటాయి. పేపర్-1 భౌతిక, రసాయనశాస్త్రం, పేపర్-2 జీవశాస్త్రం పరీక్షలు 50 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలు రెండు రోజులు ఉంటాయి. ఏడు పేపర్లు కలిపి మొత్తం 600 మార్కులకు ఉంటాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.