• facebook
  • whatsapp
  • telegram

ఏపీలో పదోతరగతి పరీక్షల సమయం పెంపు

* వంద మార్కుల ప్ర‌శ్న‌ప‌త్రానికి 3.15 గంట‌లు

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల సమయాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. వంద మార్కులకు నిర్వహించే తెలుగు, ఆంగ్లం, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రం పరీక్షలకు సమయం 3.15గంటలు ఉంటుంది. మూడు గంటలు పరీక్ష రాసేందుకు, 15నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకునేందుకు ఇస్తారు. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు పేపర్‌-1 (50మార్కులు), జీవశాస్త్రం పేపర్‌-2 (50మార్కులు)గా ఇస్తారు. దీనికి గతంలోలాగే 2.45గంటలు సమయం ఉంటుంది. రాత పరీక్షకు 2.30గంటలు, ప్రశ్నపత్రం పరిశీలనకు 15నిమిషాల సమయం ఇస్తారు. కాంపొజిట్‌ కోర్సు పేపర్‌-2కు 1.45గంటలు, ప్రధాన భాష సబ్జెక్టులకు 3.15గంటలు, వృత్తి విద్యా కోర్సులకు 2 గంటల సమయం ఉంటుంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.