వడపళని, న్యూస్టుడే: కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించాల్సిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల(ఎస్ఆర్ఎం జేఈఈఈ 2020)ను రద్దు చేసినట్లు ఎస్ఆర్ఎం వర్సిటీ నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు దేశంలోని 127 కేంద్రాలతో పాటు విదేశాల్లోనూ ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఇంటర్మీడియట్, ప్లస్టూ/ప్రీయూనివర్సిటీలలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.