* అందుబాటులో సీట్లు 69,116
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద బీటెక్లో చేరేందుకు 55,531 మంది ఆసక్తి చూపారు. ధ్రువపత్రాల పరిశీలన అక్టోబరు 20న ముగియగా మొత్తం 55,531 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 69,116 బీటెక్ సీట్లుండగా వాటిని ఆశించేవారు 55,531 మందే! కొందరు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోరు. వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే పోటీపడే వారి సంఖ్య ఇంకొంత తగ్గవచ్చని భావిస్తున్నారు. అక్టోబరు 20 నాటికి 28,674 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. అక్టోబరు 22 వరకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు గడువుంది.
ఈసారి 30 సీట్లకూ అనుమతి
సాధారణంగా బీటెక్లో ఒక సెక్షన్కు 60 సీట్లుంటాయి. ఎన్నో ఏళ్లుగా అంత మొత్తం సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇస్తోంది. ఈ విద్యా సంవత్సరం మాత్రం కొత్త కోర్సులకు 30 సీట్లకు సైతం అనుమతి ఇవ్వడం విశేషం. కొత్త కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారో లేదోనన్న సంశయంతో జిల్లాల్లోని కళాశాలలు 30 సీట్లకే అనుమతి తెచ్చుకున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.