ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గ్రూపు-1 ప్రధాన పరీక్షలు డిసెంబరు లేదా జనవరిలో జరగనున్నాయి. సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్షలు జనవరి 8 నుంచి 17వ తేదీ మధ్య జరగనున్నాయి. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను వీటికి ముందు నిర్వహించాలా? తరువాతా? అన్న దానిపై అక్టోబరు 28న జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే గ్రూపు-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎప్పుడు ప్రకటించాలన్న దానిపై కూడా సమీక్షించనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి గ్రూపు-1 ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రిలిమ్స్ ప్రశ్నల్లో దొర్లిన తప్పులపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదావేసింది. గత ఏడాది డిసెంబరు నుంచి ఇవి వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమ్స్ ప్రశ్నల్లో తప్పులు సరిదిద్దడం ద్వారా అదనంగా ప్రధాన పరీక్షలు రాసేందుకు అర్హత సాధించే వారు వందల్లోనే ఉంటారని భావిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.